అక్రమాలకు దూరంగా మిషన్ కాకతీయ: హరీష్
Published Monday, 30 May 2016హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన మిషన్ కాకతీయ మూడో దశ పనులకు ఈ ఏడాదిలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలని, అన్ని వివరాలూ ఆన్లైన్లో పారదర్శకంగా ఉండాలని మంత్రి హరీష్రావు అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం ఇక్కడ నీటి పథకాలు, మిషన్ కాకతీయ, భూ సేకరణ అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. మూడుసార్లు పిలిచినా కాంట్రాక్టర్లు రాకుంటే సంబంధిత పనులకు వేరే మార్గాలు అనే్వషించాలన్నారు. టెండర్లు రాకుంటే అయిదు లక్షల రూపాయల లోపు పనులను పంచాయితీలకే అప్పగించాలన్నారు.