గొగోయ్ శకానికి చరమగీతం
Published Friday, 20 May 2016గౌహతి, మే 19: పదిహేనేళ్లుగా తిరుగులేని అధికారాన్ని అనుభవించిన తరుణ్గొగోయ్ పాలనకు అసోం ప్రజలు స్వస్తి పలికారు. ఈశాన్య భారతంలో మొట్టమొదటిసారి మోదీ బృందానికి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారాన్ని అప్పజెప్పారు. అసోం అసెంబ్లీలోని 126 స్థానాల్లో మొత్తం బీజేపీ దాని మిత్రపక్షాలు ఏకంగా 86స్థానాల్లో విజయాన్ని నమోదు చేసి అద్భుతం సృష్టించాయి. 2011 ఎన్నికల్లో కేవలం 5 స్థానాలకే పరిమితమైన బీజేపీ అయిదేళ్లు తిరిగేసరికి సొంతంగా 60 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అసెంబ్లీలో కావలసిన మెజార్టీకి కేవలం నాలుగు స్థానాల దూరంలో ఆగింది.