ఆర్టీసీలో జలసంరక్షణకు శ్రీకారం
Published Monday, 16 May 2016శ్రీకాకుళం(టౌన్), మే 15: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ఒకటో డిపోలో జలసంరక్షణకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు ఒకటో డిపో మేనేజరు కె.్ఢల్లీశ్వరరావు ఆధ్వర్యంలో డిపో గ్యారేజీలో ఇంకుడు గుంతలు తవ్వించారు. ఆర్టీసీ డిసిటిఎం కె.శ్రీనివాసరావు ఇంకుడు గుంతలను ప్రారంభిస్తూ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో రెండు డిపోల పరిధిలో ఒకే కాంప్లెక్సు ఉండగా, భవిష్యత్లో తాగు నీటి సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు జలసంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు తవ్వించినట్టు చెప్పారు. నీటి నిల్వలను గుంతల ద్వారా భూమిలో ఇంకించడం వలన భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉంటాయన్నారు.