మూఢభక్తి!
Published Monday, 16 May 2016శ్రీకాకుళం, మే 15: ప్రేతాత్మలున్నాయి.. భూగర్భంలో అస్తిపంజరాలు, కాష్ఠం బూడిద, పుర్రెలు రోజూ తవ్వినకొద్దీ వస్తున్నాయి.. వాటికోసమే ఈ గొయి... ఇరవై అడుగులు తవ్వినా ఇంకా కన్పిస్తున్నాయి. ఇంకా తవ్వాల్సివుంది.. గుప్తనిధుల కోసం కాదు.. కోల్కతా కాళీమాత ప్రత్యక్షమై, చేసిన ఆదేశాలనే ఆచరిస్తున్నాం.. అంటూ ఆ తల్లీకూతురు చెప్పే మాటలతో స్థానికులకు భయాందోళన పట్టుకుంది. తాము నివాసం ఉంటున్న ఇంటి నుంచి 20 అడుగుల గొయ్యి తవ్వి అందులో ఐదడుగుల కాళీమాతా శిలావిగ్రహాన్ని అమర్చి వామాచారంలో ‘శక్తి’ని ఆవాహన చేస్తూ పూజలు జరుపుతున్నారు.