ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య
Published Monday, 16 May 2016విశాఖపట్నం, మే 15; ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా విధానాన్ని మార్చుకోవాల్సి ఉందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మున్సిపల్ మంత్రి కె నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సులపై మంత్రులు ఆదివారం వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ, ఫలితాలు రాబట్టే విషయంలో మాత్రం వెనుకబడిపోవడానికి కారణాలు అనే్వషించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానం, బోధన తదితర అంశాల్లో స్వల్ప మార్పులతో ఆశించిన ఫలితాలు సాధించవచ్చన్నారు.