చంద్రబాబు హయాంలోనే ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
Published Monday, 16 May 2016ధవళేశ్వరం, మే 15: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే పూర్తిచేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ధవళేశ్వరంలో ఆదివారం కాటన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అగ్రహారంలోగల కాటన్ విగ్రహానికి మంత్రి దేవినేని, రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకుడుగుంతలు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.