ప్రజలే బుద్ధి చెబుతారు
Published Monday, 16 May 2016ఏలూరు, మే 15 : ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన టిడిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, రైతు సంక్షేమాన్ని విస్మరించి పరిపాలన కొనసాగిస్తోందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కరవు భరోసా యాత్రను పురస్కరించుకుని ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఆవరణలో డిసిసి అధ్యక్షుడు రఫీయుల్లాభేగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్కు రానున్నవి మంచి రోజులన్నారు. దోచుకోవడమే పనిగా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా ఉండాలని, పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.