-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
డార్ట్మండ్, ఏప్రిల్ 12: డార్ట్మండ్ ఫుట్బాల్ జట్టును లక్ష్యంగా చేసుకొని దాడి జరగడంతో జర్మనీలో హై అలర్ట్ ప్రకటించారు. చాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ ఫస్ట్లెగ్ మ్యాచ్లు జరిగే అన్ని ప్రాంతాల్లోనూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, డార్ట్మండ్ జట్టును లక్ష్యంగా చేసుకొని జరిగిన బాంబు దాడిపై జర్మనీ పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు.
పుణె, ఏప్రిల్ 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో భారత యువ ఆటగాడు సంజూ శాంసన్ శతకంతో గర్జించాడు. ఈ టోర్నీలో ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను మంగళవారం ఇక్కడ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్తో జరిగిన అతను చక్కగా రాణించి 63 బంతుల్లో 102 పరుగులు సాధించాడు.
బెంగళూరు, ఏప్రిల్ 11: మలేసియాలోని ఇపోలో ఈ నెల 29వ తేదీ నుంచి జరుగనున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్ 26వ ఎడిషన్ హాకీ టోర్నమెంట్లో తలపడే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు స్టార్ కస్టోడియన్ పిఆర్.శ్రీజేష్ సారథ్యం వహించనుండగా, మన్ప్రీత్ సింగ్ వైస్-కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
బ్యూనస్ ఎయిర్స్, ఏప్రిల్ 11: అర్జెంటీనా ఫుట్బాల్ సంఘం (ఎఎఫ్ఎ) తమ జాతీయ జట్టు కోచ్ ఎడ్వర్డో బవుజాకు ఉద్వాసన పలికింది. వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీకి అర్హత సాధించేందుకు అర్జెంటీనా జట్టు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) అథ్లెట్ల కమిషన్లో చోటు కోసం అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో కొనసాగుతున్న తెలుగు తేజం, ఒలింపిక్ రజత పతక విజేత పివి.సింధు సహా మొత్తం తొమ్మిది పోటీపడుతున్నారు. నాలుగు స్థానాల కోసం జరిగే ఈ ఎన్నికల్లో సింధుతో పాటు భారత్ నుంచి అంతగా పరిచయం లేని పురుష షట్లర్ నిఖర్ గార్గ్ కూడా రేసులో నిలవడం గమనార్హం.
బెంగళూరు, ఏఅపిల్ 11: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ క్రికెట్ బోర్డు, ఐపిఎల్ రెండిటితోను సంబంధాలు కలిగి ఉండి కూడా బ్రాండ్లకు ఎలా ప్రచారకర్తగా ఉంటారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఉన్నతాధికారి ఒకరు ప్రశ్నించారు. గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా, ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్లో భారత జట్టు కెనడాతో తలపడనుంది. సెప్టెంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు ఈ పోరు కెనడాలో జరుగుతుంది. గత వారం స్వదేశంలో జరిగిన పోరులో భారత జట్టు 4-1 తేడాతో ఉజ్బెకిస్తాన్ జట్టును మట్టికరిపించి ప్లే-ఆఫ్కు అర్హత సాధించిన విషయం విదితమే. నాన్-ప్లేయింగ్ కెప్టెన్ మహేష్ భూపతి సారథ్యంలో భారత జట్టు సాధించిన తొలి విజయం ఇదే.
పాంగ్యాంగ్, ఏప్రిల్ 11: ఎఎఫ్సి ఆసియా కప్ క్వాలిఫయర్స్లో వరుసగా మూడు పరాజయాలను ఎదుర్కొన్న భారత మహిళా జట్టు మంగళవారం గ్రూప్-బిలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 2-0 గోల్స్ తేడాతో హాంకాంగ్ జట్టును మట్టికరిపించింది. 68వ నిమిషంలో సస్మితా మాలిక్, 70వ నిమిషంలో రతన్బాలా దేవి చెరో గోల్ సాధించి భారత్కు ఈ విజయాన్ని అందించారు.
కోల్కతా, ఏప్రిల్ 11: కోల్కతా నైట్రైడర్స్ జట్టు అభిమానులకో చేదువార్త. గత ఆదివారం ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ లిన్ ఐపిఎల్లో ఆడే అవకాశం లేదని అంటున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భుజానికి తగిలిన గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ టోర్నమెంట్లో ఆరంభ మ్యాచ్లకు దూరమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం ముంబయి ఇండియన్స్తో పోరుకు బరిలో దిగనున్నట్లు సూచనప్రాయంగా తెలిపాడు. కోహ్లీ తన జిమ్ సెషన్ వీడియోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసి ఈ మేరకు సంకేతాలిచ్చాడు.