-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
రైజింగ్ పుణే సూపర్జెయంట్స్,
ఢిల్లీ డేర్డెవిల్స్ మధ్య మ్యాచ్
(మంగళవారం రాత్రి 8 గంలకు మొదలు)
ముంబయి, ఏప్రిల్ 10: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ లిన్ భుజానికి గాయమైంది. దీనితో అతను ఐపిఎల్లో కొనసాగడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ముంబయి ఇండియన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో జొస్ బట్లర్ క్యాచ్ని అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు లిన్ కిందపడ్డాడు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: రియో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ప్రపంచ ర్యాంకింగ్స్లో ‘టాప్-10’ జాబితాలోకి అడుగుపెట్టింది. అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం, 58 కిలోల విభాగంలో సాక్షి ఐదో స్థానంలో ఉంది. కాగా, పురుషుల విభాగంలో సందీప్ తోమర్ కూడా ‘టాప్-10’లోకి చేరాడు. 57 కిలోల విభాగంలో అతను ఏడో స్థానాన్ని ఆక్రమించాడు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్లో పోటీపడనున్న భారత జట్టులో దేవేంద్రో సింగ్కు చోటు దక్కలేదు. గతంలో రెండు పర్యాయాలు పతకాలను సాధించిన దేవేంద్రో ఈసారి పోటీలకు ప్రకటించిన జట్టులో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అయితే, భవిష్యత్ టోర్నీలు, పోటీలను దృష్టిలో ఉంచుకొని, యువ బాక్సర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్టు బృందం ఎంపిక జరిగిన తీరు స్పష్టం చేస్తున్నది.
వెస్ట్ వాంగోవర్, ఏప్రిల్ 10: మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2 ఫైనల్లో చిలీని పెనాల్టీ షూటౌట్లో ఓడించిన భారత జట్టు వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్కు అర్హత సంపాదించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో భారత్క, చిలీ తీవ్ర స్థాయిలో పోటీనిచ్చింది. ఇరు జట్లు ఒకరి ప్రయత్నాలను మరొకరు అడ్డుకుంటూ, గోల్స్ కోసం దాడులకు దిగుతూ పోరాటం సాగించాయి.
ఇండోర్: స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ సోమవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో లేకపోవడం అతని అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. టి-20 ఫార్మాట్లో 10,000 పరుగుల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించేందుకు మరో 25 పరుగుల దూరంలో ఉన్న గేల్, ఆ ఫీట్ను సాధిస్తాడని ఎంతో ఆశతో వచ్చిన అభిమానులకు ప్లేయింగ్ ఎలెవెన్లో అతను లేడన్న వార్త శరాఘాతమైంది.
ఇండోర్, ఏప్రిల్ 10: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సోమవారం దాదాపు ఏకపక్షంగా సాగి న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే, 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. బెంగళూ రు తరఫున క్రిస్ గేల్ స్థానంలో ప్లేయంగ్ ఎలె వన్లో చోటు సంపాదించిన డివిలియర్స్ చక్కటి ఆ టతో 89 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: విభేదాలు లేదా అసంతృప్తులను బహిరంగంగా వ్యక్తీకరించడం సమంజసం కాదని, క్రీడా రంగంలో ఎంతో అనుభవం ఉన్నందున హుందాగా ప్రవర్తించాలనీ లియాండర్ పేస్, మహేష్ భూపతికి అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) హితవు పలికింది. ఉజ్బెకిస్తాన్తో జరిగిన డేవిస్ కప్ ఆసియా/ ఓషియానియా పోటీల్లో డబుల్స్ జట్టు ఎంపికపై పేస్, భూపతి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
చార్ల్స్టోన్లో జరిగిన వొల్వో కార్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో
జెలెనా ఒస్టాపెన్కొ (లాత్వియా)ను 6-3, 6-1 తేడాతో ఓడించి ట్రోఫీని
సాధించిన రష్యా క్రీడాకారిణి
డరియా కసట్కినా
సింగపూర్, ఏప్రిల్ 10: భారత బాడ్మింటన్ స్టార్లు పివి సింధు, సైనా నెహ్వాల్ మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న సింగపూర్ సూపర్ సిరీస్లో టైటిల్పై కనే్నశారు. ముందుగా క్వాలిఫయర్స్, ఆతర్వాత మెయిన్ డ్రా పోటీలు జరిగే ఈ టోర్నమెంట్లో ప్రపంచ రెండో ర్యాంక్లో ఉన్న సింధు హాట్ ఫేవరిట్గా బరిలోకి దిగనుంది.