-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, మార్చి 17: విజయ్ హజారే ట్రోఫీలో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఆడుతున్న జార్ఖండ్ క్రికెట్ జట్టు బస చేసిన ద్వారకా హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అధికారులు వెంటనే స్పందించడంతో, ఆటగాళ్లు క్షేమంగా బయటపడ్డారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా ఈ టోర్నమెంట్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు వాయిదా పడ్డాయి.
అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్స్లోనూ కనీసం ఒక సెంచరీ చేసిన రెండో బ్యాట్స్మన్ గ్లేన్ మాక్స్వెల్. ఇంతకు ముందు షేన్ వాట్సన్ ఈ ఘనతను అందుకోగా, రాంచీలో సెంచరీ చేసిన మాక్స్వెల్ కూడా అతని సరసన చోటు దక్కించుకున్నాడు. టెస్టుల్లో అతనికి ఇదే మొదటి శతకం. ఇంతకు ముందు అతని అత్యధిక స్కోరు 37 పరుగులు.
రవీంద్ర జడేజా స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్తో మొదలుపెడితే, ఇప్పటి వరకూ చాలా పొదుపుగా బౌలింగ్ వేస్తూ, ఉత్తమ సగటును నమోదు చేశాడు. అతను వికెట్కు సగటున 26.71 పరుగులిచ్చాడు. ఒక వికెట్కు అశ్విన్ సగటు 39.08 పరుగులు
చిత్రం. .ఐదు వికెట్లు కూల్చిన రవీంద్ర జడేజా
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ (ఓవర్నైట్ స్కోరు 4 వికెట్లకు 299): మాట్ రెన్షా సి విరాట్ కోహ్లీ బి ఉమేష్ యాదవ్ 44, డేవిడ్ వార్నర్ సి అండ్ బి రవీంద్ర జడేజా 19, స్టీవెన్ స్మిత్ 178 నాటౌట్, షాన్ మార్ష్ సి చటేశ్వర్ పుజారా బి అశ్విన్ 2, పీటర్ హ్యాండ్స్కోమ్ ఎల్బి ఉమేష్ యాదవ్ 19, గ్లేన్ మాక్స్వెల్ సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 104, మాథ్యూ వేడ్ సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 37, పాట్ కమిన్స
న్యూఢిల్లీ, మార్చి 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ల నిర్వహణ ఖర్చులపై తప్పుడు సమాచారమిచ్చే సభ్య సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు నియమించిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలనా వ్యవహారాల కమిటీ (సిఒఎ) నిర్ణయించింది.
రాంచీ, మార్చి 17: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ వికెట్ను సాధించలేకపోయినా, అటు ప్రేక్షకులను, ఇటు కామెంటేటర్లను ఆకర్షించాడు. 20 ఓవర్లు బౌల్ చేసిన అతను 70 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే, తన చిత్రవిచిత్ర హావ భావాలతో అందరి దృష్టిలో పడ్డాడు.
ఇండియన్ వెల్స్, మార్చి 17: ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ దూకుడుకు ఎలెనా వెస్నినా బ్రేక్ వేసింది. క్వార్టర్ ఫైనల్లో తన కంటే రెండు ర్యాంకులు మెరుగైన స్థానంలో ఉన్న వీనస్ను 14వ ర్యాంకర్ వెస్నినా 6-2, 4-6, 6-3 తేడాతో ఓడించి సెమీస్లోకి అడుగుపెట్టింది. ఫైనల్లో చోటు కోసం ఆమె మ్లాడెనొవిచ్ను ఢీ కొంటుంది.
ఐర్లాండ్తో శుక్రవారం గ్రేటర్ నోయిడాలో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్లో 101 పరుగులు సాధించిన అఫ్గానిస్తాన్ జట్టు కెప్టెన్ అజ్గర్ స్టానిక్జయ్. ఈ మ్యాచ్లో అఫ్గాన్ 338 పరుగులకు ఆలౌట్కాగా, చివరి వరకూ పోరాడిన ఐర్లాండ్ 47.3 ఓవర్లలో 304 పరుగులకు పరిమితమై, 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది
న్యూఢిల్లీ, మార్చి 17: ఇటీవల సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృ చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. శుక్రవారం 27వ ఏట అడుగుపెట్టిన ఆమె ఒక్కో కుటుంబానికి యాభై వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు లక్షల రూపాయలను ఆయా కుటుంబాలకు అందచేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.
కొలంబో, మార్చి 17: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో షకీబ్ అల్ హసన్ అద్భుతమైన సెంచరీతో కదంతొక్కగా, బంగ్లాదేశ్ 467 పరుగులు సాధించగలిగింది. అంతకు ముందు శ్రీలంకను మొదటి ఇన్నింగ్స్లో 338 పరుగులకు కట్టడి చేసిన బంగ్లాదేశ్కు 129 పరుగుల ఆధిక్యం లభించింది.