-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
వెల్లింగ్టన్, మార్చి 17: న్యూజిలాండ్తో జరుగు న్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 81 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 268 పరుగులకు సమాధానంగా, రెండు వికెట్ల నష్టానికి 24 పరుగుల ఓవర్నైట్ స్కోరుతోరెండో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్లకు 349 పరుగులు సాధించింది.
రాంచీ, మార్చి 17: టీమిండియాపై భారత్లో అత్యధిక స్కోరు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవెన్ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు మైఖేల్ క్లార్క్ చెన్నైలో 130 పరుగులు సాధించగా, స్మిత్ ఈ మ్యాచ్లో 178 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంతేగాక, భారత్లో ఒక టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు చేసిన మూడో బ్యాట్స్మన్గా కూడా అతని పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది.
రాంచీ, మార్చి 16: భారత్తో గురువారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సూపర్ సెంచరీ సాధించి, క్రీజ్లో నిలవగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు నాలుగు వికెట్లకు 299 పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 పరుగుల స్కోరువద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది.
చక్కటి హుక్ షాట్తో అభిమానులను అలరిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ గ్లేన్ మాక్స్వెల్. అతను సుమారు మూడేళ్ల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పటికీ, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను చివరిసారి 2014లో యుఎఇలో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాడు. కాగా, మాక్స్వెల్కు కెరీర్లో ఇది కేవలం ఐదో టెస్టు.
రాంచీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజానికి గాయమైంది. ఆస్ట్రేలియాతో గురువారం మొదలైన మూడో టెస్టు, మొదటి రోజున, భోజన విరామం తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ ఒక బౌండరీని ఆడేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో నేలపై బలంగా పడడంతో, అతని భుజానికి దెబ్బ తగిలింది. నొప్పి భరించలేక అల్లాడిన అతను కొంత సేపు ఐస్ ప్యాక్లతో ఉపశమనం పొందిన అతను ఆతర్వాత వైద్య పరీక్షలకు హాజరయ్యాడు.
న్యూఢిల్లీ, మార్చి 16: భారత బాడ్మింటన్ క్రీడాకారిణి, డబుల్స్ స్పెషలిస్టు జ్వాల గుత్తాకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పాలక మండలిలో చోటు లభించింది. 14 పర్యాయాలు జాతీయ చాంపియన్షిప్ను సాధించిన ఆమెను వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా నియమిస్తున్నట్టు సాయ్ కార్యదర్శి ఎస్ఎస్ చాబ్రా ఒక లేఖలో తెలిపాడు. తదుపరి జరిగే కమిటీ సమావేశానికి హాజరుకావాల్సిందిగా జ్వాలను అతను కోరాడు.
రాంచీ: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్పై భారత వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహా దాదాపు దాడి చేశాడు. ఈ సంఘటనలో స్మిత్ కింపడ్డాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, స్పిత్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రవీంద్ర జడేజా వేసిన బంతిని రక్షణాత్మకంగా ఆడాడు.
ఇండియన్ వెల్స్, మార్చి 16: కెరీర్లో అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ వయసును లెక్కచేయకుండా యువ ఆటగాళ్లతో పోటీపడుతున్నాడు.
ఇండియన్ వెల్స్: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, హాట్ ఫేవరిట్ నొవాక్ జొకోవిచ్ పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్లో ఓటమిపాలై నిష్క్రమించాడు. వరల్డ్ నంబర్ వన్ ఆండీ ముర్రే ఇది వరకే పరాజయాన్ని చవిచూడగా, టైటిల్ రేసులో అందరి కంటే జొకోవిచ్ ముందుంటాడని విశే్లషకులు అభివర్ణించారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో అతను కూడా ఇంటిదారి పట్టాడు.
ఇండియన్ వెల్స్: ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా ఇండియన్ వెల్స్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్స్లో ఆమె గార్బినె ముగురుజాను 7-6, 7-6 తేడాతో ఓడించింది. మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకూ ఉత్కంఠ రేపింది. ముగురుజా నుంచి ఎదురైన పోటీని సమర్థంగా ఎదుర్కొన్న ప్లిస్కోవా రెండు సెట్లలోనూ చివరి పాయింట్లు సాధించడానికి శ్రమించాల్సి వచ్చింది.