S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

09/27/2017 - 16:24

మద్యంపై జాతీయ విధానం లేదు. మద్యం రాష్ట్రాల పరిధిలోని అంశం. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంచుమించు ఒక విధానంతో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు మద్యం విక్రయాలను ప్రోత్సహించే విధంగా పాలసీలను రూపొందించాయి. బెల్ట్‌షాపులను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

09/27/2017 - 16:23

మద్యం పాలసీపై ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని అమలు చేసింది. గ్రామాల్లో బెల్టుషాపులను, అక్రమ మద్యం సరిఫరాను అరికట్టారు. గతంలో ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం పూర్తిగా నిషేధించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అందువల్లనే ప్రభుత్వం మద్యం పూర్తిగా అరికట్టకుండా విచ్చలవిడితనం లేకుండా చేయాలని భావించింది. అందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టింది.

09/27/2017 - 16:22

రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదు. అయితే కల్తీ మద్యాన్ని నివారించడంతోపాటు మద్యం మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. నాటుసారా తయారీదార్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. నూతన మద్యం పాలసీద్వారా చాలా మార్పులు వచ్చాయి. మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా జరిగింది.

09/27/2017 - 16:22

మద్యం అమ్మకాలను ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవద్దు. మద్యం మహమ్మారితో ఎన్ని జీవితాలు నాశనమవుతున్నాయి. ఎన్ని కుటుంబాలు బజారున పడుతున్నాయి... ఆర్థికంగా ఎందరు చిక్కిపోతున్నారు... వంటి అంశాలపై పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కోట్లాది రూపాయలు ఆదాయ వనరు కలిగిన మద్యం అమ్మకంలో నాణ్యత కూడా అవసరం. కానీ అసలు (నాణ్యత కలిగిన మద్యం) కంటే..చీప్ లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయి.

09/27/2017 - 16:21

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం ఆదాయం ఒక్కటే ప్రామాణికం కాదు. రాష్ట్ర ఖజానాకు సమకూరే ఆదాయ వనరుల్లో ఇది ఒక భాగం మాత్రమే. మద్యం అమ్మకాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయాన్ని పెంపొందించుకోవాలనే అభిలాష తెరాస ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. దశాబ్దాల కాలంనుండి అమలవుతున్న విధానానే్న తమ ప్రభుత్వం కొనసాగిస్తోంది తప్ప ఇప్పటికప్పుడు మద్యం అమ్మకాలను తెరాస సర్కార్ మొదలుపెట్టింది కాదు.

09/20/2017 - 19:29

సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం, సమగ్రాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తోంది. అసంఘటితంగా ఉన్న అన్నదాతలను సంఘటితం చేసే దిశగా మూడు అంచెలుగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతున్నాయి. ఇదే రీతిన రైతుబంధు, రైతు మిత్ర పేర్లతో ఆంధ్రప్రదేశ్‌లోనూ రైతు కమిటీలు ఏర్పాటవుతున్నాయి.

09/20/2017 - 19:24

రైతాంగ ప్రగతి కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం రైతు సమన్వయ సమితిల వ్యవస్థ ప్రవేశపెట్టింది. రైతాంగం సమస్యలపై ప్రభుత్వానికి, రైతులకు సలహాలు, సూఛనలందించడంలో రైతు సమితిలు వారధిగా పనిచేస్తాయ. ప్రభుత్వం రైతులకు అందించే పథకాల అమలులో రైతు సమితిలు సలహాలిస్తాయ.

09/20/2017 - 19:23

రైతుల జీవన ప్రమాణాలు పెరిగితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకోసం ప్రవేశపెట్టిన పథకాలు రాష్టస్థ్రాయిలో కిందివరకు అందడం లేదు. క్షేత్రస్థాయికి అందేలా చర్యలు తీసుకోవాలి, ఇందుకు ప్రణాళికాబద్ధమైన ప్రణాళికలు రూపొందించాలి. భారతదేశంలో వ్యవసాయరంగ అభివృద్ధికి స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

09/20/2017 - 19:23

రైతుల సంక్షేమం కోసమే రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేశాం. ఏడాదిపాటు దీనిపై కసరత్తు చేశాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఆదర్శ రైతు’ విధానాన్ని ప్రవేశ పెట్టింది. అది అశాస్ర్తియంగా ఏర్పాటు చేశారు. అందుకే వ్యవసాయ రంగంలో శాస్ర్తియ విధానంలో పథకాలు, కార్యక్రమాలు ఉండాలని భావించి రైతు సమన్వయ సమితిల ఏర్పాటుకు అంకురార్పణ చేశాం. ఈ విధానం నాలుగంచెల్లో ఉంటుంది.

09/20/2017 - 19:22

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం కీలకమైనది. వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రైతుల జీవితాలలో వెలుగు నింపాలంటే సాగునీటి సౌకర్యాలను కల్పించడంతోపాటు రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామస్థాయిలో పంటలవారీగా సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించాయి.

Pages