దూకుడు!
Published Tuesday, 4 July 2017నవతరం బ్యూటీ రాశీఖన్నా టాలీవుడ్లో యమ దూకుడును ప్రదర్శిస్తోంది. వెండితెరపై అడుగుపెట్టిన నాటినుంచి నేటి వరకు వరుస అవకాశాలతో కెరీర్లో పరుగులు పెడుతూనే వుంది. చేసిన ప్రతీ చిత్రంలో తన పాత్ర ద్వారా రెచ్చిపోతూ అదిరే రేంజ్లో నటనను ప్రదర్శిస్తోంది. తాజాగా ఎన్టిఆర్ ‘జై లవకుశ’, రవితేజ ‘టచ్ చేసి చూడు’ చిత్రాలతో పాటు ఇటీవల వరుణ్ తేజ్తోనూ జోడీ కట్టింది. టాలీవుడ్తో పాటు తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలోనూ పాగా వేయడానికి రాశీ ఉవ్విళ్లూరుతోంది. ఇలా మూడు భాషల్లో ప్రేక్షకులను తన గ్లామర్తో కట్టిపడేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇలా వివిధ భాషల్లో నటించడం పట్ల మీ ఫీలింగ్ అని రాశీని కదిలిస్తే- ‘‘చేసే చిత్రం, వేసే పాత్ర మంచిదైతే చాలు.. భాషతో పనేంటి? మనకు లభించిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నామా? లేదా? అన్నదే ముఖ్యం. అలా చేసినప్పుడే మనలోని నటి బయటికి వస్తుంది. నేను టాలీవుడ్లో అడుగుపెట్టినప్పటి నుంచి లభిస్తున్న పాత్రలు, చేస్తున్న చిత్రాలు అన్నీ నాకు భిన్నంగానే వుంటున్నాయి. నాకు వచ్చిన అవకాశాలకు నేను పూర్తి న్యాయం చేస్తూనే వున్నా. అందుకే మంచి అవకాశాలు లభిస్తున్నాయి. రాబోయే నా చిత్రాలు నా కెరీర్కు మైలురాయిలా నిలవబోతున్నాయి. చూస్తారుగా. ముఖ్యంగా నన్ను ప్రోత్సహిస్తున్న టాలీవుడ్కు, అదే స్థాయిలో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నేనెంతో రుణపడివుంటా’’అంటూ ఎంతో ఆనందంగా సెలవిచ్చింది. వాహ్..రాశీ!!