పాపం శ్రద్ధా!
Published Saturday, 4 November 2017దర్శక నిర్మాతలు కథ ప్రకారం హీరోయిన్ను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. లేకపోతే కాల్షీట్లు అడ్జెస్ట్ కాక ఎవరో ఒకరు అన్నట్లు హీరోయిన్ను ఖరారు చేయడం విన్నాం. కానీ ఈ విషయం వింటే విచిత్రంగా అనిపిస్తుంది. విషయంలోకెళితే, సాహో చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోంది. హీరోయిన్ ఎంపిక సమయంలో అనేకమందిని పరిశీలించి చివరికి శ్రద్ధాను ఎంపిక చేసింది యూనిట్. కానీ ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఓ సర్వే నిర్వహించారు. ఇందులో ప్రభాస్ సరసన ఎవరు హీరోయిన్గా నటిస్తే బాగుంటుంది అన్న ప్రశ్నకు జవాబులను ఆహ్వానించారు. అనేకమంది కత్రీనా కైఫ్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, కరీనాకపూర్ను సూచించారు కానీ శ్రద్ధాకపూర్ను మాత్రం పట్టించుకోలేదట. అభిమానులు ఎక్కువమంది కత్రీనాకే ఓటువేశారు. సాహో చిత్రంలో శ్రద్ధాకపూర్ను ఎంపిక చేయడానికి ముందే కత్రీనా పేరును కూడా పరిశీలించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో సాహో యూనిట్ ఆలోచనలో పడింది. ప్రేక్షకులు ఇష్టపడిన విధంగా కత్రీనానే హీరోయిన్గా చేస్తే బాగుండేది కదా అని ఆలోచిస్తున్నారు. సరే సినిమా నిర్మాణం పూర్తయింది కనుక, ఈ సర్వే ప్రభావం చిత్రంపై ఎంతవరకు పనిచేస్తుంది అనేది విడుదలైతే కానీ తెలియదు.