దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు
Published Thursday, 21 March 2019న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ యువత కేరింతలు కొట్టింది. హోలీ ముందురోజు నిర్వహించే కామదహనం కార్యక్రమాన్ని గుహవాటిలో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు పిడకలతో చేసిన కాముడ్ని దహనం చేశారు. పాట్నాలో హోలీలో దేశభక్తిని మేళవించారు. జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ నిలువెత్తు దిష్టిబొమ్మలను దహనం చేసి భారత్మాతాకి జై అని నినాదాలు చేశారు. అయోధ్యలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోకుల్, వారణాసిలో ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.