రాష్ట్ర సమగ్రాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం
Published Monday, 25 March 2019ఇబ్రహీంపట్నం, మార్చి 24: రాష్ట్ర సమగ్రాభివృద్ధి తెలంగాణ రాష్ట్ర సమితికే సాధ్యమని భువనగిరి పార్లమెంట్ సభ్యులు, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పునరుద్ఘాటించారు. శనివారం రాత్రి మండల పరిధిలోని బొంగ్లూరు కళ్లెం జంగారెడ్డి గార్డెన్స్లో ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఎంపీ నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టిందని అన్నారు. ఎమ్మెల్సీ లింగయ్య, జడ్పీటీసీ రమేశ్ గౌడ్, నాయకులు క్యామ మల్లేశ్, వంగేటి లక్ష్మారెడ్డి, సత్తు వెంకటరమణా రెడ్డి, కృష్ణగౌడ్ పాల్గొన్నారు.