లోటు, పాట్ల గురించి చెప్పినా పట్టించుకోలేదు
Published Monday, 25 March 2019ఖైరతాబాద్: కాంగ్రెస్లో జరుగుతున్న లోటు, పాట్ల గురించి చెప్పినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. దీంతోనే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 25 సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉండి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకభూమిక వహించినట్టు చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచారంగా తయారైందని వాపోయారు. వ్యక్తిగత అవసరాల కోసం ఎన్నడూ తపించని నేను నిబద్ధతో పనిచేశానని తెలిపారు. పార్టీ నా సేవలను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పార్టీ మారితే స్వార్ధం కోసం పార్టీ మారానని అనుకుంటారని, పార్టీని మాత్రమే వీడుతున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్లడం లేదని తెలిపారు.