‘హృదయ భారతిరత్న అవార్డు’ ప్రదానం
Published Monday, 25 March 2019కాచిగూడ: స్వర్ణ పుష్పం సామాజిక మాస పత్రిక 6వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగల్లో సేవలందించిన వారికి ‘హృదయ భారతి రత్న అవార్డ్స్’ ప్రదానోత్సవ కార్యక్రమం స్వర్ణ పుష్పం, హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య పాల్గొని వివిధ రంగంలో సేవలందించిన వారికి హృదయ భారతి రత్న అవార్డులను ప్రదానం చేశారు. స్వర్ణ పుష్పం మాస పత్రిక సామాజిక అంశలపై అనేక కథలను ప్రచరిస్తూ.. ప్రజలకు హృదయాన్ని దోచుకుందని పేర్కొన్నారు. హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టూరిజం ముఖ్య కార్యదర్శి ఐఎఎస్ బుర్రా వేంకటేశం, ప్రముఖ అధ్యాత్మిక వేత్త సత్యవాణి, సంస్థ చైర్మెన్ డా.మంగళ మక్కపాటి పాల్గొన్నారు.