రాష్ట్రంలో 439 కరోనా కేసులు
Published Monday, 13 April 2020విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 7 కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 15, చిత్తూరు జిల్లాలో 23, తూర్పు గోదావరి జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 93, కడప జిల్లాలో 31, కృష్ణా జిల్లాలో 36, కర్నూలు జిల్లాలో 84, నెల్లూరు జిల్లాలో 56, ప్రకాశం జిల్లాలో 41, విశాఖ జిల్లాలో 20, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. వీరిలో 12మంది డిశ్చార్జి కాగా, ఏడుగురు మరణించారు. 420 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.