టెలీ మెడిసిన్ సేవలు
Published Tuesday, 14 April 2020షాద్నగర్, ఏప్రిల్ 13: కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్ వివరించారు. సోమవారం కమ్యూనిటీ ఆసుపత్రిలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలు ఇళ్లల్లో నుంచి ఎవరు బయటకు రావద్దని ఫొన్ ద్వారా వైద్య సిబ్బందికి సమాచారం ఇస్తే టెలి మెడిసిన్ ద్వారా సూచనలను చేస్తామని వివరించారు. సమావేశంలో షాద్నగర్ కమ్యూనిటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ డాక్టన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న డా. చందు