అన్నదాన ప్రసాదం బాగుంది
Published Saturday, 30 April 2016ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 29: ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో దుర్గగుడి అధ్వర్యంలో నిత్యం భక్తులకు అమలు చేస్తున్న ఉచిత నిత్యాన్నదాన పథకంలో భోజనాలు బేష్గా ఉన్నాయని ఉన్నతాధికారుల బృందం దుర్గగుడి ఇన్చార్జ్ ఇవో అజాద్కు కితాబు ఇచ్చారు. పుష్కర పనులను పరిశీలించేందుకు శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎతో పాటు నగర పాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్, అదనపు పోలీస్ కమిషనర్ తదితరులు అమ్మవారి సన్నిధికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించి నిత్యాన్నదాన పథకంలో భోజనాలు చేశారు. ఈసందర్భంగా ఆజాద్ వచ్చిన తర్వాత అన్నదాన పథకంలో పలు సంస్కరణలు చేపట్టారు. ఇక్కడ భోజనం చేసిన అధికారులు భోజనాలు బేష్గా ఉన్నాయని ఇవోకు కితాబు ఇచ్చారు.