S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

20లోపు టెట్, ఎంసెట్ పరీక్షలు

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 29: వచ్చే నెల 20వ తేదీలోగా టెట్, ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన్ను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ మే 1 టెట్, 2న ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు ముమ్మరం చేయటంతో ఆ కళాశాలలన్నీ జెఏసిగా ఏర్పడి పరీక్షకు సహకరించలేదన్నారు. దీంతో తాను ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడామని, త్వరలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.