పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
Published Saturday, 30 April 2016ఖానాపురం హవేలి, ఏప్రిల్ 29 పాలేరు ఉప ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం దానకిషోర్ ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ ఆర్ రమా రాజేశ్వరితో కలిసి కైకొండాయిగూడెం, దానవాయిగూడెం, రావన్నపేటల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్స్థాయి అధికారులు, అంగన్వాడీ టీచర్లతో విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి వసతులను పోలింగ్ కేంద్రాల్లో సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ఓటర్ గుర్తింపు కార్డు, ఓటర్ నమోదు వంటి పెండింగ్ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించి ఓటర్లకు గుర్తింపు కార్డులు అందేలా చూడాలన్నారు.