వ్యవసాయక్షేత్రంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు
Published Saturday, 30 April 2016పెదకూరపాడు, ఏప్రిల్ 29: స్థానిక రిటైర్డ్ ఎంపిడిఒ వేదాంతం రఘునాథాచార్యులకు చెందిన వ్యవసాయక్షేత్రంలో ఏర్పాటుచేసిన సోలార్ విద్యుత్ కేంద్రాన్ని శుక్రవారం మాజీ యార్డుచైర్మన్ బెల్లంకొండ రామగోపాలరావు, బ్యాంకు మేనేజర్ పతకమూరి రాములు, టిడిపి అధ్యక్షుడు అర్తిమళ్ల రమేష్, డిసి చైర్మన్ వడ్లమూడి అప్పారావులు ప్రారంభించారు. ప్రభుత్వం అందించిన సబ్సిడీతో 9 లక్షల రూపాయలు వ్యయంగా 4 ఎకరాల వ్యవసాయక్షేత్రంలో సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేయడం జరిగిందని రఘునాథాచార్యులు తెలిపారు.
తొలుతగా సోలార్ విద్యుత్తో ఏర్పాటుచేసిన వ్యవసాయ కేంద్రాన్ని మాజీ యార్డుచైర్మన్ బెల్లంకొండ రామగోపాలరావు ప్రారంభించగా, విద్యుత్ మిషనరీని మేనేజర్ పతకమూరి రాములు, నీటి సరఫరాను అర్తిమళ్ల రమేష్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రముఖులు చెరుకూరి శంకర్, విద్యుత్ ఎఇ చిలకారాజు, సిబ్బంది ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త పేర్ల శివనాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.