వరిగడ్డి ట్రాక్టర్ - లారీ ఢీకొని
Published Saturday, 30 April 2016మేడికొండూరు, ఏప్రిల్ 29: గుంటూరు- నరసరావుపేట రహదారిలోని డోకిపర్రులో గల యూనివర్సల్ కళాశాల వద్ద వరిగడ్డి ట్రాక్టర్, మిర్చిలోడ్ లారీ ఢీకొని ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి... ఫిరంగిపురం మండలం యర్రగుంటపాడు గ్రామానికి చెందిన వేల్పుల అమరలింగేశ్వరరావు, చిర్రపాలు నాగభూషణం, పొన్నూరులో ట్రాక్టర్పై వరిగడ్డి లోడ్ చేసి ఇరువురు ట్రాక్టర్పై కూర్చుని వస్తుండగా నరసరావుపేట నుండి గుంటూరుకు మిర్చిలోడ్తో వస్తున్న లారీ యూనివర్సల్ కళాశాల వద్ద ఢీకొనగా ట్రాక్టర్ వరిగడ్డిపై కూర్చున్న ఇద్దరు కిందపడగా వేల్పుల అమరలింగేశ్వరరావు (23) అక్కడికక్కడే మృతిచెందాడు. నాగభూషణంకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి మేడికొండూరు ఎఎస్ఐ లింగమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.