S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే ఎమ్మెల్యేల కొనుగోళ్లను ఆపండి

గుంటూరు, ఏప్రిల్ 29: మహనీయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపైనా, ప్రజాస్వామ్య విలువలపైనా ఏమాత్రం నమ్మకమున్నా తక్షణం ఎమ్మెల్యేల కొనుగోళ్లను చంద్రబాబు నాయుడు నిలుపుదల చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన ఎమ్మెల్యేల కొనుగోళ్లకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీస్థాయిలో చేపట్టిన సేవ్ డెమోక్రసీ విజయవంతమైందని అన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం లక్షా 34 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందన్న విషయం సేవ్ డెమోక్రసీ ద్వారా జాతీయస్థాయిలో అన్ని పార్టీల నాయకులకు, ప్రజలకు అర్థమైందని తెలిపారు. అమ్ముడుపోయే ప్రజాప్రతినిధుల కన్నా కొనుగోలు చేసే వారు దుర్మార్గులని, రోజూ నీతులు చెప్పేవారే కొనుగోలుకు పాల్పడటం ఓ సామెతను గుర్తుచేస్తుందని అన్నారు. చంద్రబాబు, ఆయన తాబేదారుల అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని రాష్టస్థ్రాయిలో త్వరలో సేవ్ డెమోక్రసీని కొనసాగిస్తామని అన్నారు. విలేఖర్ల సమావేశంలో వైసిపి సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.