ఎపి, తెలంగాణపై దృష్టిసారిస్తా: అమిత్ షా
Published Thursday, 19 May 2016దిల్లీ: తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటింగ్ శాతం పెరిగిందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గురువారం మీడియాకు తెలిపారు. అస్సాంలో కూటమిగా పోటీ చేసినప్పటికీ తమ పార్టీకి సొంతంగా మెజారిటీ లభించిందన్నారు. ఇక ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తాను దృష్టిపెడతానని ఆయన తెలిపారు.