ఇద్దరు పిల్లలను హతమార్చిన యువకుడు
Published Friday, 17 June 2016హైదరాబాద్: సెల్ఫోన్ చోరీ చేసిన విషయం చెప్పేస్తారన్న భయంతో ఓ యువకుడు ఇద్దరు పిల్లలను హతమార్చిన ఘటన నగర శివారులోని హయత్నగర్లో శుక్రవారం వెలుగు చూసింది. సోహాన్ అనే యువకుడు రామ్కుమార్కు చెందిన సెల్ఫోన్ను దొంగిలించాడు. ఈ విషయం రామ్కుమార్ పిల్లలు ధన్రాజ్, ముఖేష్లకు తెలిసిపోయింది. దీంతో ఈ ఇద్దరు పిల్లలను బండరాయితో మోది సోహాన్ హత్యచేశాడు. సాక్ష్యాధారాలు లభించడంతో సోహాన్ను పోలీసులు అరెస్టు చేశారు.