ఎన్కౌంటర్లో సిఆర్పిఎఫ్ కమాండర్ మృతి
Published Friday, 17 June 2016రాంచీ: ఝార్ఖండ్లోని గిరిధ్ జిల్లా హెసాలో-పిర్టన్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో సిఆర్పిఎఫ్ కమాండర్ హరజన్ మరణించారు. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ జరిపేందుకు సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్లారు. వారిని పసిగట్టిన మావోలు తుపాకులు పేల్చారు. ఇరువర్గాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కమాండర్ మరణించగా ఓ జవాన్ గాయపడ్డాడు.