జీతాలు పెంచడం సరికాదు
Published Sunday, 3 July 2016హైదరాబాద్, జూలై 2: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను ఏ మాత్రం మెరుగుపరచకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను నాలుగు రెట్లు పెంచడం సరి కాదని లోక్సత్తా వ్యవస్ధాపకుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అవినీతి, జీతాలు ఎక్కువ, సేవలు మాత్రం తక్కువని, ప్రజలు యాచకుల్లా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి అనే వ్యవస్ధ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘటిత శక్తి ముందు దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నామని, దీనివల్ల విద్య, ఆరోగ్యానికి నిధుల కొరత ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవహేళనలు, వేధింపులు, లంచం లేకుండా పనిచేయించుకోవడం కోసం ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలకు సాధ్యం కావడం లేదన్నారు.