జగన్కు నైతికత ఉంటే వైకాపాను రద్దు చేసుకోవాలి
Published Sunday, 3 July 2016హైదరాబాద్, జూలై 2: వైకాపా అధ్యక్షుడు జగన్పై అక్రమాస్తుల కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఏ మాత్రం నైతికత ఉన్నా, పార్టీని రద్దు చేయాలని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయాన్ని కేంద్ర ఏజన్సీ సంస్థ అటాచ్ చేయడం ఇదే మొదటిసారి అన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్లతో మాట్లాడుతూ రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలంటున్న జగన్ ఏ మాత్రం అభిమానం ఉన్నా వైకాపాను రద్దు చేసుకోవాలన్నారు.