మరో ఉపరితల ఆవర్తనం
Published Sunday, 3 July 2016విశాఖపట్నం, జూలై 2 : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాన్ని అనుకుని ఏర్పడిన అల్పపీడం కొనసాగుతోందని తెలిపారు. వీటి ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని తెలిపారు.