S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

11న జడ్పీ సర్వసభ్య సమావేశం

ఆదిలాబాద్, జూలై 2: జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశాన్ని ఈనెల 11న నిరహిస్తున్నట్లు జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జడ్పీ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగే సర్వసభ్య సమావేశానికి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలుతో పాటు పార్లమెంట్, శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపిపిలు హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని వివిధ శాఖల ఎజెండా అంశాలపై చర్చించడం జరుగుతుందని, సంబంధిత అధికారులు పూర్తి ప్రగతి నివేదికలతో హాజరుకావాలని సూచించారు.

జీయర్ గురుకులాన్ని తనిఖీ చేసిన జోనల్ అధికారి
ఉట్నూరు, జూలై 2: స్థానిక మండలం బిర్సాయిపేట్ సమీపంలోని అన్నంపెల్లి లో గల జీయర్ గురుకుల పాఠశాలను జాతీయ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ జోనల్ అధికారి కృష్ణవేణి శనివారం తనిఖీ చేశారు. భారత గిరిజన సంక్షేమ వెల్ఫేర్ నిధులతో నడుపబడుచున్న గురుకుల పాఠశాలను సందర్శించడంతో పాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులను కేటాయిస్తుందని, అందులో భాగంగా గురుకులానికి సైతం నిధులు సమకూరుతాయని అన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినప్పుడే దానికి సార్థకత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపివో జనరల్ నాగోరావుతో పాటు గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.