అక్రమంగా గోవుల రవాణా
Published Sunday, 3 July 2016పెరవలి, జూలై 2: పశువధశాలకు కంటైనరు వ్యానులో అక్రమంగా తరలిస్తున్న యాభై గోవులను గోరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని పోలీసుల సహకారంతో గోశాలకు తరలించారు. జాతీయ రహదారి పెరవలి వద్ద శనివారం ఒక వ్యానులో గోవులను రవాణా చేస్తుండగా గోరక్షణ సమితి సభ్యులు కొండ్రెడ్డి శ్రీనివాసు మరికొంత మంది అడ్డుకుని పోలీసుల సహకారంతో నల్లజర్ల మండలంలోని అవపాడు గోశాలకు తరలించారు. వీటిని శ్రీకాకుళం నుండి హనుమాన్జంక్షన్ లోని గోవధశాలకు తరలిస్తున్నట్లు గోరక్షణ సమితి సభ్యులు తెలిపారు. పెరవలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.