బాగ్దాద్లోనరమేధం
Published Sunday, 3 July 2016బాగ్దాద్:ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో రద్దీగా ఉండే రెండు మార్కెట్లలో బాంబు పేలుళ్లకు పాల్పడి పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం కలిగించారు. రంజాన్ పవిత్రమాసం సందర్భంగా భోజనాలు చేస్తున్నవేళ వారు ఈ దాడికి తెగబడ్డారు. నిత్యం రద్దీగా ఉండే కరద, షల్లాల్ మార్కెట్లలో వారు బాంబు దాడులు చేశారు. కరద మార్కెట్లో మొదట ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని దాడి చేస్తే రెండోచోట కారుబాంబు పేల్చారు. దాదాపు 75మంది మరణించగా మరో వందమంది గాయపడ్డారు. ఇరాక్లో ఇన్నాళ్లూ ఐసిస్ పట్టున్న ఫలుదా నగరాన్ని ఇరాకీ దళాలు స్వాధీనం చేసుకున్న తరువాత ఆ ఉగ్రవాద సంస్థ ఇంత పెద్దఎత్తున ప్రాణనష్టం కలిగించడం ఇదే ప్రథమం.