గోదావరికి వరద ఉధృతి
Published Sunday, 3 July 2016భద్రాచలం:ఎగువున ఉన్న ఇంద్రావతి, ప్రాణహిత నదుల్లో వరద పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరికి నీటిప్రవాహం వేగంగా పెరుగుతోంది. శనివారం రాత్రి 18 అడుగుల నీటిమట్టం ఉండగా ఆదివారం మధ్యాహ్నానికి అది 28 అడుగులకు పెరిగింది. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలవల్ల వరదనీరు పెరుగుతోంది. ఒకటిరెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.