గంగమ్మ ఆలయంలో చోరీ
Published Tuesday, 5 July 2016ధర్మవరం రూరల్, జూలై 4: పట్టణంలోని చైతన్య కాలనీలో గంగమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ పూజారి మల్లికార్జున మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం అమ్మవారికి పూజలు నిర్వహించి యధాప్రకారం ఆలయానికి తాళం వేసుకుని వెళ్ళామన్నామన్నారు. తిరిగి సోమవారం ఆలయం వద్దకు వచ్చి చూస్తే ఆలయానికి వేసిన తాళం పగులకొట్టి అమ్మవారి వెండి కనుగ్రుడ్లు, కనుబొమ్మలు, కోరమీసంతోపాటు పలు ఆభరణాలు చోరీ అయినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.