యువతి ఆత్మహత్య
Published Tuesday, 5 July 2016గుత్తి, జూలై4:గుత్తి మండల పరిధిలోని గాంధీనగర్కు చెందిన రామలక్ష్మి అనే యువతి(18) సోమవారం పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు గుత్తి పోలీసులు తెలిపారు.