S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించం

గుంతకల్లు, జూలై 4:హిందూవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం అభివృద్ధి పేరిట దేవాలయాలను కూల్చి వేస్తే సహించమని విహెచ్‌పి నాయకులు హెచ్చరించారు. స్థానిక ఇల్లూరు గోపాలకృష్ణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విహెచ్‌పి జిల్లా అధ్యక్షులు సోమశేఖర్, డివిజన్ అధ్యక్షులు విశ్వనాథ్‌లు మాట్లాడుతూ అభివృద్ధి పేరిట ప్రభుత్వం అడ్డువచ్చిన దేవాలయాలను ధ్వంసం చేయడం, వాటిని దిబ్బల్లో వేయడం దారుణమన్నారు. మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం అనేకమైన రాయితీలను కల్పిస్తోందన్నారు. అదే హిందూవులు దేవాలయాలకు వెళ్లే భక్తులకు చార్జీల పెంపు, అధిక భారాలను విధిస్తున్నారన్నార. హిందూ దేవాలయాల నుండి పెద్దఎత్తున భక్తుల కానుకలను గ్రామాల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారన్నారు. అయితే దేవాలయాల అభివృద్ధికి కాని, మరమ్మతులకు కాని ప్రభుత్వం నుండి నిధులు సమకూర్చడం లేదన్నారు. అదే మైనార్టీ వర్గాలకు చెందిన మజీదుల మరమ్మతులకు, చర్చిల మరమ్మతులకు నిధులను మంజూరు చేస్తోందన్నారు. మెజార్టీ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు వారి మనోభావాలను దెబ్బతీయడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలకు ప్రభుత్వం స్వస్థి పలకాలని హెచ్చరించారు. అభివృద్ధికి అడ్డుకాదని, అయి తే పక్కా ప్రణాళికలతో రూపొందించుకుని పనులు చేపట్టాలని హితవు పలికారు. ఈ సమావేశంలో విహెచ్‌పి నాయకులు రవి, రమేష్, ప్రభాకర్ పాల్గొన్నారు.