ట్రాన్స్కో సిఎండి పదవీ కాలం మరో రెండేళ్లు పొడిగింపు
Published Tuesday, 5 July 2016తిరుపతి, జూలై 4: ట్రాన్స్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అప్పయ్యదొర పదవీ కాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2013 ఆగస్టు 30న ట్రాన్స్కో సిఎండిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లుగా సిఎండిగా కొనసాగేందుకు ప్రభుత్వం అప్పుడు ఉత్తర్వులు జారీచేసింది. ట్రాన్స్కో సిఎండిగా బాధ్యతలు స్వీకరించిన అప్పయ్యదొర తొలినుంచే ట్రాన్స్కోలో వివిధ రకాల సంస్కరణలు ఏర్పాటు చేసి రైతులకు, ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇటీవల కురిసిన వరదల బీభత్సవాలలో ఐదు జిల్లాల్లో ఏర్పడి అనేక విద్యుత్ సమస్యలను ఆలస్యం చేయకుండా పునరుద్ధరించి ప్రజలచేత ప్రభుత్వం చేత మన్ననలు పొందారు. ఈనేపథ్యంలో ఆయన మరో రెండేళ్లపాటు అదే పదవిలో కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంతో ఆయన 2018 ఆగస్టు వరకు ట్రాన్స్కో సిఎండిగా కొనసాగనున్నారు.