కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Published Tuesday, 5 July 2016చిత్తూరు, జూలై 4: కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంఘటన సోమవారం చోటు చేసుకొంది. ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగడం ఆనవాయితీ, ఈ క్రమంలో ఎస్ ఆర్ పురం మండలం పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన క్రిష్ణయ్య (41) ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. తనకు ప్రమాదం జరగడంతో కూలి పనికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని, తనకు ఏదైనా ఉపాధి అవకాశం కల్పించాలని పలుమార్లు అధికారుకు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో జీవితంపై విరక్తి కలిగి కలోక్టరేట్వద్ద నిద్రమాత్రలు మింగి సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గమనించిన స్థానికుల వెంటనే అక్కడే ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే క్రిష్ణయ్యను వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.