భూగర్భజల మట్టాలు పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక
Published Tuesday, 5 July 2016ఒంగోలు, జూలై 4: జిల్లాలోని 13 మండలాల్లో భూగర్భజల మట్టాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లాకలెక్టర్ క్షేత్రాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి భూగర్భజలాలు పెంపు, ప్రజాసాధికార సర్వే, మీకోసం అర్జీల పరిష్కారం, పారిశుద్ధ్యం, అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం, నీరు -చెట్టు, సేద్యపుకుంటల నిర్మాణం, ఉపాధిహామీ పనులు, వర్మీకంపోస్టు, బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానం, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈసమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.