సర్వేపై అసత్యాలను నమ్మకండి: మంత్రి పల్లె
Published Saturday, 16 July 2016అనంతపురం: ప్రభుత్వం చేపట్టిన సాధికార సర్వేపై విపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మరాదని ఎపి ఐటి, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి శనివారం ఇక్కడ మీడియాతో అన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించాలన్న సంకల్పంతో సర్వేను చేపట్టామన్నారు. ప్రభుత్వానికి జనాదరణ పెరుగుతోందన్న కక్షతోనే విపక్షాలు సర్వేపై అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు.