లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి
Published Wednesday, 20 July 2016మంచిర్యాల అర్బన్, జూలై 19: లక్ష్యానికి మించి మొక్క లు నాటి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని అధికారులకు రాష్ట్ర దేవాదా య శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. మంగళవా రం పట్టణంలోని ఐటిఐ కళాశాల, 29వ వార్డు, ఐబి గెస్ట్ హౌజ్ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఆగస్టు చివరి నాటికి పూర్తిస్థాయిలో మొక్కలు నాటి హరిత ఆదిలాబాద్గా రూపుదిద్దుకునేలా చూడాలని సూచించారు. జిల్లాలో నర్సరీలవారీగా అందుబాటులో ఉన్న మొక్కలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. జిల్లాలో మొక్కల కొరత ఉంటే ఇతర జిల్లాలనుంచి తెప్పించి పంపిణీ చేయాలన్నారు.