సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అనుమానాలు
Published Friday, 22 July 2016మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. తమ పొలాలకు నీళ్లు వస్తాయా? రావా? అని కొందరు, తమ ప్రాంత భూములకు తగిన నష్టపరిహారం ఇస్తారా? ఇవ్వరా? అని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బలవంతంగా భూసేకరణ జరిపినా, నష్టపరిహారంలో అన్యాయం జరిగినా నిర్వాసిత రైతులకు తాము అండగా ఉంటామన్నారు.