తల్లిదండ్రుల చెంతకు మాధవి, వైష్ణవి
Published Friday, 22 July 2016హైదరాబాద్: హైదర్గూడలో అదృశ్యమైన చిన్నారులు మాధవి, వైష్ణవిలను శుక్రవారం పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు రోజుల క్రితం ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి కొట్టడం వల్లే మాధవి తాతగారింటికి పారిపోయిందని, తానూ వస్తానని చెప్పడంతో వైష్ణవిని తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.