విజయవాడలో కేంద్రం దిష్టిబొమ్మ దగ్ధం
Published Friday, 22 July 2016విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపి కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లును ఓటింగ్కు రాకుండా అడ్డుకున్నందుకు నిరసనగా కేంద్రం దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం ఇక్కడి ఆంధ్రరత్న భవన్ వద్ద దగ్ధం చేశారు. ప్రత్యేక హోదాపై ఎపి సిఎం చంద్రబాబు ఇకనైనా తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటిస్తే గనుక ప్రైవేటు బిల్లును కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకుంటుందని ఆయన చెప్పారు.