రియో ఒలింపిక్స్కు వెళ్లనున్న సచిన్
Published Saturday, 23 July 2016న్యూఢిల్లీ, జూలై 22: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెండూల్కర్ రియో ఒలింపిక్స్కు వెళ్లనున్నాడు. భారత ఒలింపిక్ సంఘానికి సుహృద్భావ రాయబారిగా నియమితుడైన సచిన్ను ఆగస్టు 5వ తేదీ నుంచి బ్రెజిల్లో ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడలకు విచ్చేయవలసిందిగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అధ్యక్షుడు థామస్ బాచ్ ఆహ్వానించాడు. దీంతో సచిన్ వచ్చే నెల 2వ తేదీన రియో డీ జెనిరో నగరానికి బయల్దేరనున్నాడు. ఈ పర్యటన సందర్భంగా సచిన్ అక్కడ భారత ఒలింపిక్ క్రీడా బృందాన్ని కలుసుకుని వారికి శుభాకాంక్షలు తెలుపనున్నాడు. ఒలింపిక్స్కు సచిన్ వెళ్లడం ఇదే తొలిసారి.