తెలంగాణ ఆపిల్ జిల్లాలోనే మొదటి మొక్క
Published Saturday, 23 July 2016ఎల్లారెడ్డిపేట, జూలై 22: జిల్లాలోనే తెలంగాణ ఆపిల్ మొక్కను ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో నాటామని ఉద్యానవన శాఖ పిడి సంగీతలక్ష్మీ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట వ్యవసాయ కార్యాలయం, బొప్పాపూర్లోని మార్కెట్ కమిటీ, ఆయా గ్రామాల్లో శుక్రవారం ఘనంగా వ్యవసాయ దినోత్సవాన్ని నిర్వహించారు. జడ్పీటిసి ఆగయ్య, ఎంపిపి సుజాతలతో కలిసి ఆమె మొక్కలను నాటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులై విజయవంతం చేయాలని అన్నారు. మొక్కలను నాటడడంతో పాటు సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సుభాష్, తహశీల్దార్ పవన్కుమార్, ఎంపిడివో చిరంజీవి, ఎక్సైజ్ సిఐ నీరజారెడ్డి, సర్పంచ్లు మమత, భీమేశ్వర్, దేవలక్ష్మీ, ఎడి అనిల్కుమార్, ఎవో భూమిరెడ్డి, ఎడిహెచ్ జ్యోతి, హెచ్వో ప్రతాప్సింగ్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.