మంత్రి కేటీఆర్ రాజీనామాకు యూత్ కాంగ్రెస్ డిమాండ్
Published Thursday, 22 September 2016హైదరాబాద్ : నగరంలో రహదారులను ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదని అరోపిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. నగరంలో భారీ వర్షం కురిసి రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమైనా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎక్కడా పరిశీలించలేదని యూత్ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్ అధ్వర్యంలో కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. అందోళన చేస్తుండగా పోలీసులు బలవంతంగా వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.